సంగం నాగరాజు మన్యం టీవీ ప్రతినిధి జూలూరుపాడు, ఫిబ్రవరి 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఇల్లందు శాసనసభ్యులు భానోత్ హరిప్రియ నాయక్ చేపట్టిన ఒకరోజు నిరసన దీక్ష కు సంఘీభావం తెలిపి, దీక్షలో పాల్గొన్న వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం భిక్ష కాదని, అది తెలంగాణ ప్రజల హక్కు అని, ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో కేంద్రం దాటవేత ధోరణి సరికాదని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణకు ద్రోహం చేయడమే తప్ప మరొకటి కాదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకసార్లుడ బయ్యారంలో సర్వేలు చేసి స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా
ఉన్నాయని, ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశంలోనే మొత్తం ఇనుప ఖనిజం లో 11 శాతం బయ్యారంలో ఉందని ఉక్కు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు లభిస్తాయని స్థానిక గిరిజనులు ఇతరులు ఆశగా ఎదురు చూస్తున్నారని, ఉక్కు పరిశ్రమ బయ్యారంలో ఏర్పాటు చేయకపోతే ప్రజాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురికాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment: