CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి స్కూల్లో క్రమం తప్పకుండా కథలు చదివించాలి.

Share it:

 



 మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ప్రతి స్కూల్లో క్రమం తప్పకుండా రీడ్ అండ్ ఎంజాయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిల్లల చేత కథల పుస్తకాలు చదివించాలని అశ్వరావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి రాంబాబు అన్నారు. అశ్వరావుపేట కాంప్లెక్స్ పరిధిలో నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, ఏఎస్ఆర్ నగర్, నందమూరి కాలనీ, పేట మాలపల్లి, పాఠశాలలను సి ఆర్ పి ప్రభాకరాచార్యులు తో కలిసి ఆకస్మికంగా సందర్శించి ,రీడ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. విద్యార్థులలో అభ్యాసన మెరుగుపడాలి అంటే చదవడం రావాలి అందుకు తరగతుల వారీగా ప్రభుత్వం అందించిన గ్రంథాలయ పుస్తకాలను పిల్లలకు ఇవ్వాలి వంద రోజులు పూర్తయ్యే నాటికి పిల్లలకు ధారాళంగా చదవడం రావాలి అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల రికార్డులను, మధ్యాహ్న భోజన రికార్డులను పరిశీలించారు.

Share it:

TS

Post A Comment: