- రహదారి నిర్మించాలి గ్రామస్థుల వేడుకోలు
మన్యం మనుగడ, ములకలపల్లి: ఈ భూమ్మీదకు అడుగు పెట్టిన నాటి నుండి ఎన్నో రకాల అనుభూతులు ఆప్యాయతలు మంచి చెడులు కష్టసుఖాలు బ్రతికున్నప్పుడు చూడడం సహజం. పుట్టిన వాడు గిట్టక మానడు అనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ భూమితో బంధాలు తెగిపోయాక చివరి మజిలీ సైతం చనిపోయిన ఆత్మలు సైతం ఘోషించే ఎలా ఉన్నది ఆ గ్రామ పరిస్థితి. ఎవరైనా నా చనిపోతే దహన సంస్కారాలు జరపాలంటే మోకాళ్ళ లోతు బురదలో శవాలను అష్టకష్టాలు పడుతూ తీసుకెళ్లాల్సిన దుస్థితి. దీనిపై మన్యం మనుగడ ప్రత్యేక కథనం.
ములకలపల్లి మండలం జగన్నదపురం పంచాయితీ నల్లవారిగూడెం గ్రామంలో మల్లమ్మ కుంట చేరువు పక్కన ఉన్న స్మశాన వాటిక కు వెళ్ళటానికి సరైన దారి లేక మొకళ్ళ లోతు బురదలో నల్లవారిగూడెం గ్రామస్థులు భౌతికకాయాన్ని తీసుక వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి దారి ని మరమ్మతులు చెయ్యాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Post A Comment: