గుండాల ఫిబ్రవరి 17 ( మన్యం మనుగడ) మండలం పరిధిలోని మామ కన్ను గ్రామానికి చెందిన రైతు కల్తీ కన్నయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బి ఎస్ పి జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు, పినపాక నియోజకవర్గ అధ్యక్షులు రవి డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు అయిన డిఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్ ఒత్తిడి వల్లనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని వారిని ప్రభుత్వం తక్షణమే విధుల నుండి తొలగించాలన్నారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామంటే ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Post A Comment: