మన్యం మనుగడ కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కరకగూడెం తహసీల్దార్ కార్యాలయం, మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం ఎంపీడీవో శ్రీను పలు శాఖల అధికారులు మొక్కలు నాటారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధించిన అధినేతగా గా రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉంది అంటే అది కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిదర్శనమని వారన్నారు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ చిరంజీవి, ఆర్ఐ షేక్ హుస్సేన్ పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: