గుండాల ఫిబ్రవరి 9 (మన్యం మనుగడ) సమస్య వివరిస్తే ఎదురు దాడి చేయడం సరైంది కాదని టిడిపి మండల అధ్యక్షులు సాంబయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూ పోడు రైతుల కోసం మాట్లాడితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అంత ఉలిక్కిపాటు ఎందుకని అన్నారు. చెట్టుపల్లి, వెన్నెల బైలు, ముత్తు పురం, తురు బాకా, మామ కన్ను, బాటన్న నగర్, గ్రామాల్లోని గిరిజన రైతులు ఫారెస్ట్ అధికారులతో నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆ సమస్యను వివరిస్తే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. ఫారెస్ట్ అధికారులు జెసిబి లతో పోతుంటే మహిళలే పెద్ద మొత్తంలో ఎదురు తిరుగుతున్నారని వారు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నారు కనుక మేము ప్రయత్నిస్తున్నామని ప్రశ్నించే వారిపై ఎదురు దాడి చేయకుండా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాలఎంపీటీసీ సంధాని, నాయకులు ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, మధు, పెద్ద బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: