మన్యంటీవి, అశ్వారావుపేట: అనారోగ్యంతో మృతిచెందిన సాయుధ తెలంగాణా పోరాట యోధుడు రేగుల చిన్నారెడ్డి (90) కి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రేగుల చెన్నారెడ్డిని కుటుంబీకులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. చెన్నారెడ్డికి భార్య ఇరువురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. భౌతిక దేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి స్వగృహానికి తరలించగా, మంగళవారం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చెన్నారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సాయుధ పోరాట కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో గెరిల్లా దళాలు ఆయన నాయకత్వం వహించారు. దళ నేతగా పలు పోరాటాలు భూ విముక్తి ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. జైలు జీవితం గడిపిన చెన్నారెడ్డి ఆ తర్వాత సిపిఐ లో పనిచేశారు. చెన్నారెడ్డి చేసిన కృషిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు మరియు కార్యకర్తలు మండల నాయుకులు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం రేగుల చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
Post A Comment: