మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన దబ్బా. ఆది లక్మి అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ తీవ్ర అస్వస్థతకు గురైంది. గ్రామ ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బండ. మనోజ్ రెడ్డి , బగుతు. చిరంజీవి వారి సొంత ఖర్చు లతో ఆమెను వైద్య శాల లో చేర్పించి చికిత్స ఇప్పించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా.కాంతారావు ఆదేశాలతో వెంటనే స్పందించిన పినపాక నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బండ మనోజ్ రెడ్డి సకాలంలో ఆదిలక్ష్మిని వైద్యశాలకు తరలించి సరైన చికిత్స అందించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకి, బండ మనోజ్ రెడ్డి కి చిరంజీవికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: