CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భార్యను కొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ.పోలీసుల అదుపులో నిందితుడు.

Share it:

 


మన్యం వెబ్ డెస్క్ :

హుస్నాబాద్ వార్తలు:- భార్యను కొట్టి చంపి రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరణ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఉమ్మడి మండలంలోని పంతులు తండాలో చోటు చేసుకుంది.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన జాటోత్ స్వామి తన భార్య మన్నెమ్మ తో రాత్రి గొడవ పడ్డారు. కుటుంబంలో భూ సమస్యలతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. భార్య మన్నెమ్మను తల పట్టుకొని గోడకేసి కొట్టాడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మన్నెమ్మ మృతి చెందడంతో హత్యానేరం తప్పించుకునేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే నేపథ్యంలో తన ట్రాక్టర్ ట్రాలీలో మృతదేహాన్ని వేసుకొని అక్కన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పడవేశాడు. భార్య మణెమ్మ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు నమ్మపలికాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Share it:

TS

Post A Comment: