చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: స్వరాష్ట్ర ఉద్యమానికి శాంతియుత మార్గంలో నడిపిన నాయకుడు, తెలంగాణ జాతిపిత కెసిఆర్ అని టిఆర్ఎస్ నాయకులు అన్నారు. గురువారం టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ.... తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ళ సత్యనారాయణ, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, సర్పంచులు మల్లిపెద్ది లక్ష్మీ భవాని, పూసం వెంకటేశ్వర్లు, భానోత్ కుమారి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులుసయ్యద్ రసూల్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్యనాయక్, గాదె శివప్రసాద్, సారేపల్లి శేఖర్,వంకాయలపాటి బాబురావు, సూర వెంకటేశ్వర్లు,కుంజ వెంకటేశ్వర్లు, గుగులోత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: