CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే వ్యక్తి రేగా

Share it:

 



మన్యం మనుగడ, పినపాక : 


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను గ్రామాల్లో నిరుపేదలకు అందేలా, టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పని చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ పరిశీలకులు అన్నారు. సోమవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల విస్తృత స్దాయి సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. 

ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు మాట్లాడారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే వ్యక్తి రేగా కాంతారావు అని తెలియజేశారు

గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు గ్రామాల్లో భాధ్యతగా పని చేయాలన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులకు అందుతన్నాయా, లేదా అనేది తెలుసుకొని అందరికీ అందేలా పనిచేయాలన్నారు. టీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తలను, నాయకులను పార్టీ కాపాడుకుంటుందన్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించుకొని ప్రజా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉండాలన్నారు. 

ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు, 

పోశం నర్సింహారావు, కోలేటి భవానీ శంకర్‌, కంది సుబ్బారెడ్డి, పొనుగోటి భధ్రయ్య, బొలిశెట్టి నర్సింహారావు, వట్టం రాంబాబు, కందుల కృష్ణార్జున్‌రావు, వెన్నా అశోక్‌, షబీర్‌, మేడా లక్మీనారాయణరెడ్డి, ప్రభుదాస్‌, సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు,ఉడుముల లక్ష్మిరెడ్డి, దొడ్డా శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షులు మిట్టపల్లి సాగర్‌యాదవ్‌, మండల కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,సభ్యులు,సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్‌లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: