మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వలస ఆదివాసులకు రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా గోపాలరావు మాట్లడుతూ..
మండల పరిదిలోని ఎలకలోడ్డు గ్రామ సమీపంలో గత రెండు సంవత్సరాలుగా వలస ఆదివాసులు నివసిస్తున్నారని, వారికి ఎటువంటి సౌకర్యాలు లేవని, వారికి త్వరతగతిన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
వలస ఆదివాసుల పట్ల తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి వీడి వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్య క్రమంలో మడివి కిశోర్
హెమ్లా నంగా, మడివి హిడ్మా, కట్టం ముయు, ఐతు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: