మన్యం మనుగడ, మణుగూరు:
సింగరేణి లో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనాల పెంపు, చట్టబద్ద హక్కులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తారీకు నుండి జరగబోయే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మణుగూరు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో p v కాలనీ రామాలయం నుండి అంబేద్కర్ పార్క్ వరకు ప్రదర్శన నిర్వహించి. వేతనాలు పెంచాలని, చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు.అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి, జి.శ్రీనివాస్, మంగీలాల్, అక్కి. నరసింహారావు, వెలగపల్లి. జాన్, ఎండీ.గౌస్ లు మాట్లాడుతూ నేడు జరగబోయే చర్చల్లో సింగరేణి యాజమాన్యం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇతర చట్టపరమైన హక్కులు ,సౌకర్యాలు కల్పించే విధంగా సానుకూలంగా స్పందించాలని కోరారు. యజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఈనెల 12వ తారీకు నుండి నిరవధిక సమ్మె చేసి ఉత్పత్తిని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు నల్ల. రమేష్, ఉప్పుతల.నరసింహారావు, దుగ్యాల సుధాకర్, ప్రసాద్, వేణు, ఇమాంబి, లింగస్వామి, శ్రీనివాసు. నాగేశ్వరరావు, రాంబాబు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: