గుండాల ఫిబ్రవరి 23 (మన్యం మనుగడ) మండలంలో బలమైన క్యాడర్ ఉన్న ఒకే ఒక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మండల అధ్యక్షులు బెల్లం భాస్కర్ అన్నారు. బుధవారం రైతు వేదికలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పినపాక నియోజకవర్గం నాయకులు హాజరయ్యారని ఆయన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి పల్లెకు తిరుగుతూ ప్రతి ఇంటిని చేరుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తామన్నారు. ఏదో ఒక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ నీ విజయం సాధించేందుకు శాయశక్తుల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మణుగూరు జడ్ పి టి సి పోషన్ నరసింహారావు, భవాని శంకర్, సాగర్ యాదవ్, భద్రయ్య, ఆళ్ల పల్లి జెడ్ పి టి సి హనుమంతరావు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: