- అధిక లోడుతో వెళుతున్న ఇసుక లారీలు.
- లారీల డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రాణాలు తీస్తున్న పట్టించుకోని అధికార యంత్రాంగం.
- ఓకే వే బిల్లులో ముసుగులో వందల లారీలు పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 23)
వాజేడు మండలం మోరుమురు కాలనీ గ్రామం 163 వ జాతీయ రహదారి, వెంకటాపురం నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే చత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పేరుపాలు గ్రామం చెందిన ఎoడ్రిక దయామని వయసు 70 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా తన కూతురు నక్క, కాంత, w/ జగపతిరావు నివాసం ఉంటున్నారు. ఈరోజు సాయంత్రం సమయంలో రోడ్డుకు ఇరువైపులా నడుస్తున్న వృద్ధురాలిని లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు.
పరిమితికి మించి ఇసుక లారీలు.
వాజేడు మండల పరిధిలో ఇసుక సొసైటీల పేరుతో ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకి పరిమితికి మించి వ్యవహరిస్తున్న తీరు స్థానిక ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓవర్ లోడ్ తో వెళుతుండటంవల్ల డ్రైవర్ నిర్లక్ష్యం, ఇసుక కాంట్రాక్టర్ల, నిర్లక్ష్యం తో రోడ్డుపై వెళుతున్న నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
Post A Comment: