మన్యం మనుగడ ,కొత్తగూడెం:
కొత్తగూడెం కలెక్టరేట్ లో కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి పనులు పై జిల్లా కలెక్టర్ అనుదీప్ తో* సమావేశమై, పలు అంశాలపై చర్చించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .
ఈ సమావేశాలోని ముఖ్య అంశాలు:
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి లోని ఈ మధ్యనే నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చివేయవద్దని, త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి నూతనంగా నిర్మించుకున్న ఇళ్లకు కూడా పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేస్తానని జిల్లా కలెక్టర్ కి ఎమ్మెల్యే వనమా తెలిపినారు.
2) పాత కొత్తగూడెం లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తరగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరిన ఎమ్మెల్యే వనమా.
*3) రుద్రంపూర్ పంచాయతీలోని SRT ఇళ్లను కూల్చివేత తక్షణమే ఆపివేయాలని, అక్కడ ఉన్న పేద ప్రజలకు సింగరేణి సంస్థ ద్వారా ప్రత్నామ్నాయం ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యేల వనమా*
అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరిన ఎమ్మెల్యేల వనమా
Post A Comment: