మన్యంటీవి, అశ్వారావుపేట: ఆర్బిఐ వారు చేపట్టిన ఆర్థిక అక్షరాశ్యత వార్షికోత్సవంలో భాగంగా తేదీ16-02-2022 బుధవారం నాడు పేస్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల కేంద్రంలో డివికే డిగ్రీ కళాశాల యందు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహించడం జరిగింది. గో డిజిటల్ & గో సెక్యూర్, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం గురించి అవగాహన కల్పించడం, డిజిటల్ లావాదేవీల భద్రత కల్పించడం కస్టమర్ల రక్షణ కల్పించడం, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడం జరిగింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సేవింగ్ పైన అవగాహనా, మరియు వారి పేరెంట్స్ చేప్పవలసిన విషయాలు పేస్ ఎన్జీఓ సభ్యులు వివరించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక అక్షరాస్యత ఏరియా కోఆర్డినేటర్ వి అంజి బాబు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ దాది చంటి, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరత్నం, లెక్చరర్స్ పట్టెలా బాలరాజు, జక్కుల ఝాన్సీ రాణి, పాండు రంగారావు మరియు కళాశాల విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.
Post A Comment: