మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తొగూడెం గ్రామంలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్ తెలిపారు.బుధవారం,తొగ్గూడెం గ్రామంలో మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్,ఎస్ఏలు నరేష్, పురుషోత్తం ఆధ్వర్యంలో సమ్మక్క-సారక్క జాతర వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, తొగ్గూడెం గ్రామంలో జరుగుతున్న జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అడుగడుగునా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం కొన్ని కొన్ని ఏరియాల్లో, సీసీ కెమెరాల ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎవరైనా సరే భక్తులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐ నాగేశ్వరరావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: