మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ప్రభుత్వ విఫ్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా రెండవ రోజు, ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్ లకు పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సర్పంచుల సంఘం అధ్యక్షులు, నారం రాజశేఖర్ , మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీను, కుంజా గంగాభవాని, పొడియం సత్యవతి, కే పరమేష్, తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో వైద్యులు రాంబాబు చేతుల మీదుగా పాలు, పండ్లు బుధవారం నాడు పంపిణీ చేయడం జరిగింది. మండల వ్యాప్తంగా రేపు మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాముడు, మండల యువజన నాయకులు మాలోతు ఆలీ బాబు, పోడియo వెంకటేష్, మోడియం దుర్గారావు, నారం కళ్యాణ్, శ్రీను, మాలోతు నవీన్ నాయక్, మాలోతు వెంకట్ నాయక్, బి మంగారావు, జే హరి నాయక్, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు యూత్ నాయకులు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: