CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫారెస్ట్ అధికారుల ఒత్తిడి వల్లే కల్తి కన్నయ్య ఆత్మహత్య.

Share it:

 


గుండాల ఫిబ్రవరి 16 (మన్యం మనుగడ) ఫారెస్ట్ అధికారుల ఒత్తిడి వల్లనే మామ కన్ను గ్రామానికి చెందిన రైతు కార్తీక్ అన్నయ్య మృతి చెందాడని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు జయరామ్, సెక్షన్ ఆఫీసర్ దైదా బేగం ఒత్తిడి వల్లనే కన్నయ్య ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఇ నెలకొందన్నారు. కన్నయ్యకు 20 ఎకరాల భూమి ఉండగా గత సంవత్సరం 10 ఎకరాలు తీసుకొని మొక్కలు నాటాలని ఈ సంవత్సరం మిగతా 10 ఎకరాలు తీసుకోవడంతో మనోవేదనకు గురై మంగళవారం పురుగు మందు తాగాడని చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు అన్నారు కన్నయ్య మృతికి పూర్తి బాధ్యత ఫారెస్ట్ అధికారుల దేనని ఆయన అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, గుండాల సర్పంచ్ సీతారాములు, నాయకులు పెంటన్న, మంగ అన్న, వై వెంకన్న , ఎస్.కె అజ్గర్, బాబు, చింత నరసన్న, పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి, చింత కోటేష్ , వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: