గుండాల ఫిబ్రవరి 16 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని మామ కన్ను గ్రామానికి చెందిన కల్తీ కన్నయ్య మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని గుండాల ఎంపీటీసీ సంధాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్న తరుణంలో ఫారెస్ట్ అధికారులు తనకు ఉన్న భూమిని గుంజుకుని హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్న మనోవేదనతో మంగళవారం పురుగుల మందు తాగాడు అన్నారు. బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడని ఈ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు
Post A Comment: