(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 20)
శనివారం గట్టమ్మ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కంభంపాటి రమేష్. శ్రీను .జ్యోతి మరియు చండ్రుపట్ల గ్రామానికి చెందిన బుద్ధ కళ్యాణ్ కుటుంబాలను నుగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయన బుచ్చయ్య. పరామర్శించారు. బుచ్చయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మండలంలో మంచి కార్యకర్తలను కోల్పోయిందని వారి లేని లోటు పార్టీకి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పేరు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెను మల్లు రామకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సొమీడి నరసింహారావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గొంది రమణారావు, ములుగు జిల్లా రైతు బంధు కార్యవర్గ సభ్యులు తల్లడి నాని బాబు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వనపర్తి సత్యనారాయణ లోట పిట్టల రాంబాబు, పీఏసీఎస్ అధ్యక్షులు ఎగ్గిడీ అంజయ్య, చింతూరు ధర్మారం సర్పంచులు బొల్లె సూర్యం, తెల్లం బుల్లెట్ శ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొత్తగట్టు సాంబమూర్తి, గోవర్ధన, శేషగిరి స్వామి, పిఎసిఎస్ డైరెక్టర్ బచ్చు సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రమేష్, మిర్యాల రమణయ్య, కుదురుపాక రాములు బుద్ధ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: