గుండాల ఫిబ్రవరి20(మన్యం మనుగడ) జన జాతర నుండి వన ప్రవేశం చేసిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు. గిరిజన కుంభమేళా అయిన మేడారం జాతర మహాఘట్టం ముగిసింది సమ్మక్క భర్త పగిడిద్దరాజు ను మేడారం జాతర ముగిసిన తర్వాత ఆర్ అరెo వంశీయులు మేడారం నుండి కాలినడకన గుండాల మీదుగా వేపల గడ్డ గ్రామానికి తీసుకువచ్చి వన ప్రవేశం చేయించారు. మేడారం జాతరలో సమ్మక్క ,సారలమ్మల తో పాటు గద్దెల మీద కొలువై ఉండి ఇ భక్తులకు దర్శనమిచ్చారు .మహా జాతర ముగిసిన తర్వాత పగిడిద్దరాజును వేపల గడ్డ గ్రామానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరెం వంశీయులు నాగన్న, బిక్షం , కాంతారావు, బసవయ్య , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: