CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కోడి పిల్లలు ఇప్పిస్తామని డి డి కట్టించారు .ఏళ్ళు గడుస్తున్న స్పందించని పశు వైద్య సిబ్బంది.

Share it:

 


గుండాల ఆళ్ల పల్లి ఫిబ్రవరి 13 (మన్యం మనుగడ) మండలంలోని పశు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు 2014లో గిరిరాజా కోడి పిల్లలను ఇప్పిస్తామంటూ ఆరుగురు లబ్ధిదారులకు డిడి కట్టించి ఇప్పటివరకు కోడి పిల్ల కాదు కదా దాన్ని గుడ్డును కూడా వారికి అందించని పశు వైద్య సిబ్బంది. ఆళ్లపల్లి మండలంలోని పశు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ ఘటన నిలుస్తుంది ఒక్కొక్కరికి ఆరువందలకు పైగా డిడి కట్టించి ఇప్పటివరకు ఇవ్వకపోగా అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై స్పందించిన న్యూ డెమోక్రసీ నాయకులు ఆదివారం కట్టిన డి డి జిరాక్స్ లతో ఉన్నతాధికారులు స్పందించాలని ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా పశు వైద్య జిల్లా అధికారులు లబ్ధిదారులకు కోడి పిల్లలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాపారావు, బత్తినీ సత్యం, మాజీ దళనేత బట్టు సురేష్ , ఉప్పలయ్య , ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: