- పాత్రికేయుల సమావేశంలో సాగించిన పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ
మన్యం మనుగడ, పినపాక:
మండలంలో వందల ఏళ్లుగా గిరిజనులు, గిరిజనేతరులు జీవనం సాగిస్తున్నారని ఎంపీపీ గుమ్మడి గాంధీ తెలిపారు. పినపాక మండలం తోగ్గూడెం పోడు రైతుల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఒక మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గొంది నాగభూషణం అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీల సర్పంచ్ లతో పాటు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, గ్రామపంచాయతీలో ఎన్నో ఏళ్ల క్రితమే పోడు చేసి వ్యవసాయం చేసుకుంటున్న వారి భూములను హరితహారం పేరుతో అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని అలాంటి ప్రయత్నం మరొకసారి చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.. తాతల కాలం నుంచి సాగులో ఉన్న పోడు భూముల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటోన్న గిరిజనులు, గిరిజనేతరుల భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ సీఎం కేసీఆర్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇచ్చారని, అయినా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న అటవీశాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఆదివాసీలపై అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పినపాక మండలం లో సరిహద్దు పనులు ప్రారంభిస్తే ఆదివాసుల సత్తా చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి నరసింహారావు, సర్పంచులు బాడిస మహేష్ , కొర్శా కృష్ణ రాజు, పూనేం సుజాత ,కల్తీ శ్రీలత, ఎంపీటీసీలు కాయం శేఖర్, హరీష్, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: