గుండాల ఫిబ్రవరి 11 (మన్యం మనుగడ) కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్ అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని కన్నాయిగూడెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. దేశంలో కులం మతం విభేదాలు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు. విద్యార్థులందరినీ సమానత్వంతో చూడాలని సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనూష , సాయి కుమార్, సురేష్ , నరేష్ , బిక్షం , పి ఓ డబ్ల్యు నాయకులు నాగలక్ష్మి , అనసూర్య , సుగుణ , సావిత్రి , పీ వై ఎల్ నాయకులు ప్రమోద్ , చంద్రయ్య , సారయ్య , బాబు రావు పాల్గొన్నారు
Post A Comment: