మన్యం మనుగడ, దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట
దమ్మపేట మండల పరిషత్అభివృద్ధి అధికారిగా డి. చంద్రశేఖర్ సోమవారం భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల సమస్యల పరిష్కారానికి అన్నివిధాలా కృషి చేస్తానని, అన్ని వర్గాల నాయకులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే మెచ్చా ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎంపిడివో
అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ని తాటిసుబ్బన్నగూడెం గ్రామంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా
దమ్మపేట మండల ఎంపిడిఓ డి. చంద్ర శేఖర్ కలిశారు.ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు కు పూల మొక్కను అందజేశారు.ఎంపిడిఓ వెంట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఉన్నారు.
*ఎంపిడిఓ ను మర్యాద పూర్వకంగా కలిసిన దమ్మపేట మండల పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు*
దమ్మపేట మండలం పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు నూతన ఎంపిడిఓ డి. చంద్రశేఖర్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పందే టి చెన్నారావు, ప్రభాకర్, మహేష్ ,గోరిపాటి బసవయ్య, సహదేవుడు, ఆకుల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: