CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆ వంద మంది కాంట్రాక్టు కార్మికుల కు న్యాయం చెయ్యండి.కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న బిటీపీఎస్ కాంట్రాక్టర్లు.సి ఐ టి యు బిటీపీఎస్ అధ్యక్షుడు సతీష్ కుమార్.

Share it:

 


 

మన్యం మనుగడ ప్రతినిధి(కొత్త దామోదర్ గౌడ్):బిటీపీఎస్ కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని సి ఐ టి యు బిటీపీఎస్ అధ్యక్షుడు సతీష్ కుమార్ మండిపడ్డారు.

                        బి టి పి ఎస్ లో బి హెచ్ ఈ ఎల్ ద్వారా హేడెక్ అనే కంపెనీ గత రెండు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నదని,వర్క్ చేసే అందుకు వేరే రాష్ట్రాల నుండి వంద మంది హిందీ వర్కర్లను తీసుకువచ్చి వారితో పని చేయించుకొని వారికి గత మూడు నాలుగు నెలల నుంచి ఎటువంటి జీతాలు చెల్లించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. కాంట్రాక్టర్ల దోపిడీ మూలంగా వలస కార్మికులు పూట వెళ్ళని ధీన పరిస్థితి లో ఉన్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. సోమవారం బి టి పి ఎస్ మెయిన్ గేటు ఎదురుగా ఉన్నటువంటి CITU యూనియన్ ఆఫీస్ కి వచ్చి 100 మంది కాంట్రాక్ట్ కార్మికులు వారి యొక్క బాధలను యూనియన్ ఆఫీసు నందు తెలియపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సి ఐ టి యు బీటి పి ఎస్ అధ్యక్షుడు సతీష్ కుమార్ వారి సమస్యను జిఎం దృష్టి కి తీసుకవేళ్ళారు. వారం రోజుల్లో వారి వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో మణుగూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కంపెనీ మీద కేసు వేయడానికి వెనుకడేది లేదని స్పష్టం చేశారు.స కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సి ఐ టి యు బిటీపీఎస్ అధ్యక్షులు సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: