మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఇటీవల పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీరాములు (45) ప్రమాదవశాత్తు మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ తరఫున మంజూరైన రూ. 2 లక్షల రూపాయల చెక్కును ఆయన చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బండ మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: