CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్,ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ప్రధాన రహదారి ర్యాలీగా వెళ్లి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి.తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని,మోడీ డౌన్ డౌన్ అంటూ ప్రధాన రహదారి వెంట నినాదాలు చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.భారత ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలపై వివక్ష,సవతితల్లి ప్రేమను చూపుతున్నారని ఆరోపించారు.తెలంగాణకు నిధులు కేటాయింపులు, ఉద్యోగాల కల్పనలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వం,పనితీరును తెలంగాణ ప్రజలు బిజెపి నాయకులకు,బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆ సమయం ఎంతో దూరంలో లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండి వలి యాబీ సలీం,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సయ్యద్ సర్దార్ పాషా,టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, రామన్న గూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ,ఎండి అరిఫ్,బట్టు రమేష్, కాళ్ల రామకృష్ణ,ధనపు నేని కిరణ్ కుమార్,అజ్మత్ ఖాన్, చంద్రబాబు, బోజా రావు, శ్రీనివాస్,మోహన్,విజయ్, లక్ష్మీనారాయణ,సమ్మయ్య, రవీందర్,రఘుబాబు,ఓంకార్, సమ్మయ్య,రవీందర్,సమ్మయ్య, రామకృష్ణ,రాజ్ కుమార్, స్వామి,వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: