CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంచిర్యాల జిల్లాలో బీజేపీకి షాక్.. 50 మంది రాజీనామా.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్, మరో 50 మంది అనుచరులు రాజీనామా చేశారు. తెలంగాణ సమాజం పట్ల చిన్న చూపు, వివక్ష చూపుతున్న భారతీయ జనతా పార్టీ విధానాలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మద్ది శంకర్ తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి బీజేపీలో విలువ లేదని తెలిసి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మద్ది శంకర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.


లేఖలోని ముఖ్యాంశాలు

‘‘తెలంగాణా సమాజం పట్ల చిన్న చూపు, వివక్ష చూపుతున్న భారతీయ జనతా పార్టీ విధానాలతో విసిగిపోయి,తెలంగాణా ఆత్మగౌరవానికి బీజేపీలో విలువ లేదని తెలిసి ఆ పార్టీ మందమర్రి పట్టణ

అధ్యక్ష పదవికి,ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.


పార్లమెంటులో ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గేలి చేస్తూ తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు.ఈ మాటను బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల అతనికి సదభిప్రాయం లేదని అర్థమయింది.


madhi-shankar

అంతేకాక గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలం పాటలు ఉపసంహరించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టీఆరెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ,పరిశ్రమల శాఖ మంత్రి కె.టీ.ఆర్.లు కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కె.కె.6 గనులను సింగరేణికి అప్పగించకుండా వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ వాడిగా నేను కూడా జీర్ణించుకోలేకపోయాను. సింగరేణి కార్మికులు ఈ బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని మూడు రోజులు సమ్మె చేసినా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించింది.


మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా వేధిస్తుండటం కూడా నన్ను కలచివేసింది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన చేస్తూ,ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీలో మనసు చంపుకొని ప్రజావ్యతిరేకిగా ఉండలేను. తెలంగాణ ఉద్యమమంలో పాల్గొని ఆమరణ దీక్ష కూడా చేసిన నేను తెలంగాణ సమాజ పతనం ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నాను.


నాతొ పాటుగా బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య , పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి దోనుగు రమేష్, పట్టణ పార్టీ కోశాధికారి మురళి, యువ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు రంగు రమేష్, బీసీ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షులు బండి రవి, చెల్లేటి తిరుపతయ్యలు కూడా రాజీనామా చేస్తున్నారు.


ఇన్నినాళ్ళు నాకు సహకరించిన బీజేపీ లోని నా మిత్రులకు, నా సహచరులకు, అనుచరులకు,ప్రింట్, మరియి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తు నా రాజకీయ కార్యాచరణలో కూడా మీ అందరి సహకారం వుండాలని కోరుకుంటున్నాను.’’ అని మద్ది శంకర్ లేఖలో స్పష్టం చేశారు.

Share it:

TS

Post A Comment: