CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించిన రేగా.కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలు అయిన కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కలిగా కాంతారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మణుగూరు లోని ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్ లో కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం, ఇల్లందు , నియోజకవర్గాల వారీగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో నియోజకవర్గాల వారీగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,

 ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులను కోరారు. పథకాలను ప్రతి గడపగడపకు తీసుక వెళ్ళినప్పుడే ప్రజలకు సీఎం కేసీఆర్ పథకాలు పూర్తిగా తెలుస్తాయని పేర్కొన్నారు.త్వరలోనే మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

 కార్యకర్తలందరిని తమ పార్టీ కంటికి రెప్పలా, కాపాడుకుంటుంది అని ఆయన భరోసా ఇచ్చారు.

 పార్టీకి పునాదులు గ్రామ ,వార్డు, కమిటీలు అని ప్రభుత్వ పథకాలు గడపగడపకు చేరుతాయని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: