మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధి లోని ఇరవెండి గ్రామ పంచాయతీలో,ఐటీసీ-పిఎస్పీడి,సోషల్ ఇన్వెస్ట్మెంట్స్, ద్వారా రూ.10 లక్షల రూపాయల తో నూతన బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భుర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఐటీసీ-పిఎస్పీడి యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి, యూనిట్ హెచ్ఆర్ జిఎం శ్యామ్ కిరణ్,అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెంగల్ రావు, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు పాల్గొని పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ఇరవెండి సర్పంచ్ కోర్స. లక్ష్మి,మోతె పట్టినగర్ సర్పంచ్ పోతినూరి సూరమ్మ, టీఎన్టీయూసీ,ప్రెసిడెంట్,కనకమేడల.హరిప్రసాద్,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం.జగదీష్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి. వంశీకృష్ణ,స్థానిక వార్డు సభ్యులు,స్థానిక పంచాయతీ సెక్రటరీ,స్థానిక టిఆర్ఎస్ నాయకులు,స్థానిక ఉపసర్పంచ్,స్థానిక వార్డు సభ్యులు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: