మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ( 31 ) సోమవారం ;-
కిసాన్ మోర్చా ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం రైతు విద్రోహదినం నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షు లు కె పుల్లయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక ప్రభుత్వం వ్యవహరించిన కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది సంవత్సరం రోజుల పాటు దేశం నడిబొడ్డున రైతు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచి వేసి అనేక మంది రైతులు చనిపోవటానికి కారణమైందని అనేక కుట్రలు చేసిందని చివరికి ఐదు రాష్ట్రాల ఎన్నికల దృశ్య రైతుల ఉద్యమం బీజేపీ ప్రభుత్వం మోడీ పై ప్రజా వ్యతిరేకత కూడా కడతారని భయపడి మూడు వల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటానని హామీ ఇచ్చి నేటికీ ఆ హామీని అమలు చేయలేదని తక్షణమే పార్లమెంట్ సమావేశాల్లో మూడు నల్ల చట్టాలను నాలుగు లేబర్ కోడలు వెనక్కి తీసుకోవాలని ఈరోజు రైతు విద్రోహదినం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చట్టాలను వెనక్కి తీసుకోకపోతే కార్మిక కర్షక ఐక్యతతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ కొప్పుల శ్రీను నర్సయ్య నాగరాజు రాజు రాంబాబు మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: