మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 01 ;-
దమ్మపేట పామాయిల్ ఫ్యాక్టరీ రోడ్డులొ సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పడిన విప్లవ కాలనీ లో సిపిఐ 97వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపినారు మొదట జండా ఆవిష్కరణ సిపిఐ జిల్లా నాయకులు పండూరు వీరబాబు ఆవిష్కరించగా అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపినారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో దమ్మపేట లో ఈ పది సంవత్సరాల కాలంలో సుమారు 400 మందికి ఇళ్ల స్థలాలు చూపించడం జరిగిందని అనేక సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన ఘనత సిపిఐదని నిరంతరం ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని భవిష్యత్తులో ప్రతి ఒక పేదవాడికి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేది సిపిఐ పార్టీ అని తెలిపినారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తంగేళ్లమూడి శివకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యురాలు బెల్లం కృష్ణవేణి మహిళా సంఘం నాయకురాలు ఎస్కే జాన్ బి గిరిజన సంఘం మండల కార్యదర్శి మాధవ ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి సుంకు పాక ధర్మ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి ఏఐటీయూసీ మండల నాయకులు గొర్రెపాటి బసవయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
Post A Comment: