మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో చీమలపాటి బిక్షం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య హాజరై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు అనేక తెగుళ్ళు వల్ల పంట నష్టపోయారని అన్నారు. ఎంతో శ్రమించి కష్టపడిన సొమ్మును పంట మీద పెట్టి లాభం వస్తుందనే సమయంలో మిర్చి తోట లకు అనేక రకాల తెగుళ్ళు సోకటం వల్ల మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ విషయంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వాలు తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గూగులొత్ ధర్మ, మండల కార్యదర్శి బానోతు ధర్మ, సభ్యులు యాస నరేష్, బానోత్ ఇస్రా, గార్లపాటి వెంకటి, గాడిదేశి కనకరత్నం, ఉడల వెంకటేశ్వర్లు, బానోత్ మధు, వళ్ళ మల్ల చందర్రావు, పదం సుగుణ, తాటి పద్మ, లకావత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: