మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరా వుపేట మండల కేంద్రంలోని పాస్టర్ రోని,ప్రేమ్ రాజ్ ల ఆద్వర్యంలో చర్చిలో నూతన సంవత్సర వేడుకలు నిర్వ హించగా ఈ వేడుకలకు ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క హాజరై గోవిందరావుపేట మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ముందుగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సర్వ మత సమ్మేళనం మన భారతదేశం అని,స్వేచ్ఛ, సమనత్వాలను మనకు ప్రసాదించింది డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని,త్యాగానికి ప్రతీక యేసుక్రీస్తు అని అన్నారు. ఇంకా కరోన ప్రమాదం పొంచి ఉందని ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటూ మాస్కులను ధరించి,భౌతిక దూరం పాటించాలని అన్నారు. అనంతరం నిరంతరం సేవ కార్యక్రమాలు చేస్తున్న సీతక్క ను,పైడాకుల అశోక్ ను పూలమాలలతో మరియు శాలువలతో సన్మానించారు.ఈ సందర్భముగా సీతక్క, పైడాకుల అశోక్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.అనంతరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని సీతక్క ప్రార్ధన లో పాల్గొన్నారు.మరొకసారి సీతక్క కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్,పస్రా అటవీ శాఖ అధికారి శిరీష,మండల మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,ముదురు కోళ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: