మన్యం మనుగడ దుమ్మగూడెం::
దుమ్ముగూడెం మండలంలో చిన్న ఆర్లగూడెం గ్రామం వద్ద ఆర్ అండ్ బి రోడ్డు కొంగవాగు కాలువ వద్ద తూములు విరిగిపోయిన అట్టి మరమ్మతులు ఆర్అండ్ బి అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరీయ కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈరోజు ఆ రోడ్డు వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు అలాగే ములకపాడు నుంచి లక్ష్మీపురం వరకు రోడ్డు మొత్తం కూడా గోతులు గోతులు ఉన్నది ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే అనారోగ్యం పాలవుతున్నారు ఈ రోడ్డు నిర్మాణం కోసం 20 కోట్లు నిధులు విడుదల అయినట్టుగా మండల టిఆర్ఎస్ నాయకులు గతంలో పేపర్ ప్రకటన చేసి ఉన్నారు అది ఇది నేటి వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు కావున వెంటనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్అండ్ బి అధికారులు రోడ్డు నిర్మాణం తో పాటు చిన్నర్లగుడెం బ్రిడ్జి నిర్మించాలని ఆ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నారు కొర్శ వెంకటేశ్వర్లు, మర్మం భద్రయ్య, కారంఎర్రయ్య, కోర్శ రాజులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: