మన్యం టీవీ మణుగూరు:
అంగ బలం,అధికార బలం తో సామాన్యులను జలగలా పట్టి పీడిస్తూ,రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన వనమా.రాఘవ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పివి కాలనీ, కూనవరం రైల్వేగేట్ వద్ద రాఘవ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా అధ్యక్షులు ఏ.మంగీలాల్, మాట్లాడుతూ సంచలనం సృష్టించిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో,ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారు సమాజంలో ఇంకా అనేకమంది నాయకులు ఉన్నారని,వారి ఆకృత్యాలు కూడా బయటకు రావాల్సి ఉందన్నారు.ఏదో ఒకరోజు బయట పడతాయన్నారు.రాఘవకు న్యాయస్థానం విధించే శిక్ష ఇలాంటి అకృత్యాలకు పాల్పడే దుర్మార్గులకు కనువిప్పు కావాలన్నారు.ఈ కార్యక్రమం లో ఏ.మంగీలాల్,కె.వీర్రాజు,కే. గురుమూర్తి,రజబ్ అలీ,సాంబ, రామకృష్ణ,సాయి,నాగరాజు,సాంబయ్య,వినయ్,వెంకట్ నారాయణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: