మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా రైతు ఇంటి ముంగిళ్ళలో రైతుబంధు ముగ్గులతో కళకళలాడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట పంచాయతీలో రైతుబంధు ముగ్గులను మహిళలు ఎంతో ఇష్ట పూర్వకంగా, వారి వారి ముంగిళ్లలో వేస్తున్నారు.పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో శనివారం రోజున జానంపేట సర్పంచ్ బాడిస మహేష్ ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి, జానంపేట ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళలు వేసిన, రైతుబంధు కు సంబంధించిన ముగ్గులను తిలకించడం జరిగింది. మహిళలు ఎంతో పోటీ పడి, ఎవరికి వారు అందమైన రీతిలో రైతుబంధు కు సంబంధించిన ముగ్గులు వేయడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ నినాదంతో ముగ్గులు వేసి, పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే కాంతారావు, రాష్ట్ర పురోగతిలో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గుర్తుకు వచ్చే విధంగా ముగ్గులు వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ధర్మయ్య, నాని, మండల సి సి, గ్రామ వివో, తో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: