CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పులి దాడిలో మరణించిన ఆవు యజమానికి అటవీ శాఖ నుండి పరిహారం అందజేత.పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 





మన్యం మనగడ, పినపాక : 


పినపాక మండల పరిధిలోని అమరారం గ్రామానికి చెందిన కొట్టెం శేషగిరిరావుకు చెందిన ఆవు, కొన్ని రోజుల క్రితం పినపాక అటవీ ప్రాంతంలో తిరుగాడిన పులి దాడిలో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సదరు ప్రాంతానికి వెళ్లి పరిశీలించి ఆవు యజమాని కి పరిహారం హామీని ఇచ్చింది . ఇందుకు గాను అటవీశాఖ నుండి వచ్చిన పరిహారం గురించి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలియజేయగా రూ.25,000 చెక్కును , అమరారం గ్రామంలో కొట్టెం శేషగిరి రావుకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, అటవి క్షేత్ర అధికారి తేజస్విని, డి ఆర్ ఓ అరుణ, అమరారం ఎంపీటీసీ శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, అటవి శాఖ సిబ్బంది, అమరారం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: