మన్యం మనగడ, పినపాక :
పినపాక మండల పరిధిలోని అమరారం గ్రామానికి చెందిన కొట్టెం శేషగిరిరావుకు చెందిన ఆవు, కొన్ని రోజుల క్రితం పినపాక అటవీ ప్రాంతంలో తిరుగాడిన పులి దాడిలో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సదరు ప్రాంతానికి వెళ్లి పరిశీలించి ఆవు యజమాని కి పరిహారం హామీని ఇచ్చింది . ఇందుకు గాను అటవీశాఖ నుండి వచ్చిన పరిహారం గురించి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలియజేయగా రూ.25,000 చెక్కును , అమరారం గ్రామంలో కొట్టెం శేషగిరి రావుకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, అటవి క్షేత్ర అధికారి తేజస్విని, డి ఆర్ ఓ అరుణ, అమరారం ఎంపీటీసీ శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, అటవి శాఖ సిబ్బంది, అమరారం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: