మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాకర్ల వర్సెస్ సాయిరాం తండా ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో సాయిరాం తండా జట్టు విజయం సాధించింది. ఈ ఆటలో మూడు వికెట్లను సాధించి, ఒక మేడిన్ ఓవర్ ఏసీ తన జట్టు విజయానికి ఉత్తమ ప్రతిభను కనబరిచిన భూక్య నగేష్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సీల్డ్ ను జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సభ్యులు సిహెచ్ నరసింహారావు, బుడేన్ పాషా, రత్న కుమార్, రమేష్, శంకర్, తదితరులు అందజేశారు.
Post A Comment: