- యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయం ఎస్సై కార్తీక్..
మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. అఖిలభారత యువజన సమైక్య ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి సాబీర్ పాషా మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏఐవైఎఫ్ ఎన్నో పోరాటాలకు కేంద్రబిందువైందని అన్నారు. పోరాటాలే కాక యువకుల్లో ఐకమత్యాన్ని పెంచేందుకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జూలూరుపాడు ట్రైనీ ఎస్ఐ కార్తీక్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ క్రికెట్ పోటీలు దోహద పడతాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని కోరారు. ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, తెలంగాణా రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చండ్ర నరేంద్ర కుమార్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోయిన విజయ్ కుమార్, జూలూరుపాడు వెం గన్నపాలెం సర్పంచులు, ఎంపీటీసీలు, పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరు మధుసూదన్ రావు, గలిగే సావిత్రి, గుండె పిన్ని విజయ, కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్, నున్నా కృష్ణయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు గజ్జల సందీప్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు అనుమల సాయి, విసంశెట్టి వికాస్, కార్తీక్, ప్రవీణ్, ఎస్ కె సమీర్, రాఖి, సతీష్, నరేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: