గుండాల/ ఆళ్లపల్లి జనవరి 26 (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా లో దూసుకుపోతుందని ఆళ్ల పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలను నిర్వహించారు. కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా రేగా కాంతారావు నియమించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రేగా నాయకత్వంలో జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , మైనార్టీ నాయకులు ఆధం , కార్యదర్శి ఆరిఫ్ , మండల నాయకులు ఖయ్యుం , వేమూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: