గుండాల జనవరి 26 ( మన్యం మనుగడ) మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. మండలంలోని అన్ని కార్యాలయాల పై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రంగు రమేష్ జండా ఎగరవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో హజరత్ వలి జెండా ఆవిష్కరించారు.స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ కరుణాకర్ జెండాను ఆవిష్కరించారు. ఎంఆర్సి కార్యాలయం లో ఎంఈవో కృష్ణయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషన్ జెండాను ఆవిష్కరించారు. సాధిక వైద్యశాలలో డాక్టర్ రవి చంద్ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జెండాలను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు
Post A Comment: