మణుగూరు. మండలానికి చెందిన రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితాను ప్రకటించారని అట్టి జాబితాలో రామ చంద్రయ్య (క్రమ సంఖ్య 96) ఎంపిక జరిగినట్లు ఆయన చెప్పారు. మారు మూల ప్రాంతం నుండి ప్రతిష్టాత్మక పురస్కారానికి గిరిజన వ్యక్తి ఎంపిక కావడం చాలా సంతోషమని, మన జిల్లాకు దేశ స్థాయిలో లభించిన గొప్ప గౌరవమని చెప్పారు. అవార్డు లభించిన రామచంద్రయ్య ఓకల్, ఫోక్ కళాకారుడు.
Post A Comment: