మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,అశోక్ నగర్ లోని కిన్నెర కళ్యాణ్ మండపంలో వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యం లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీల లో 40 మంది మహిళలు పాల్గొన్నారు. వాసవియన్ దుగ్గి.నీలిమ, దొసపాటి.రోజా,దోసపాటి.స్వర్ణ,చిత్తలురి.ఉమా,న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు మొదటి బహుమతి వాణి అశోక్ నగర్, ద్వితీయ బహుమతి అంజలి రాజీవ్ గాంధీ నగర్,మూడవ బహుమతి పి.గౌతమి బండారు గూడెం గా ఎంపిక చేశారు. పోటీల లో పాల్గొన్న అందరికీ కన్సోలేషన్ బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమం లో వనిత వైభవ్ క్లబ్ అధ్యక్షరాలు చిట్లూరి.మణి, అధ్యక్షత వహించగా గౌరవ అతిథిగా వాసవి క్లబ్ అధ్యక్షులు దిండకూర్తి. బ్రహ్మయ్య,ముఖ్య అతిధి గా రీజన్ చైర్మన్ బండారు. నరసింహరావు,మాట్లాడుతూ పాత సంప్రదాయాలను గౌరవించాలని కోరారు.వాసవి క్లబ్ సెక్రెటరీ సముద్రాల. కృష్ణమూర్తి,ట్రేజరర్ కోంజర్ల. కృష్ణమూర్తి,డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ చితలురి.రమేష్ బాబు, శేషుబాబు,ధర్మయ్య,ప్రసాద్ లు పాల్గొని కార్యమాన్ని విజయవంతం గా నిర్వహించారు.
Post A Comment: