మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రామాలయం ఆవరణంలో శనివారం రోజున వాయిద్య కళాకారులు నూతన కమిటీ ఎన్నిక జాడి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వాయిద్య కళాకారులు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి అంకుష్, కార్యదర్శి ఎండి సుకుర్ ఈ సమావేశానికి హాజరై వారు మాట్లాడుతూ.వాయిద్య (బ్యాండ్ బాజా) కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించి వాయిద్య కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.
వాయిద్య కళాకారుల సంఘం ఏటూరు నాగారం మండల అధ్యక్షుడిగా పొలం నాగరాజు, ఉపాధ్యక్షుడిగా కుమ్మరి గంగరాజు,కార్యదర్శి బట్ట లక్ష్మీనారాయణ,ప్రచార కార్యదర్శి,డబ్బ భాస్కర్, కోశాధికారి జాడి నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గగ్గురి గణేష్,సలహాదారులుగా ఎరుకట్ల వెంకట్ రామ్ నరసయ్య,పెద్ద బోయిన సమ్మయ్య,కార్యవర్గ సభ్యులు శ్రీను,బండారి చంద్రు,అల్లి నాగేశ్వరరావు,జాడి సత్యం, బోగ్గం నారాయణ,జాడి భార్గవ్,జనగాం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: