చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాల్లోవేడుకలను నిర్వహించారు.మండల రెవెన్యూ కార్యాలయంలో తాహసిల్దార్ ఉషశారద, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ అన్నపూర్ణ,రైతు వేదికల్లో ఏవో నవీన్ బాబు, పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజేష్ కుమార్, తెలంగాణ దిమ్మె వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా బాబు, ఆటో యూనియన్ అడ్డ వద్ద ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాంబాబు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: