మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుని త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయా కార్యాలయాలలో కరకగూడెం ఎస్ ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో శ్రీనివాస్ డాక్టర్ పర్షియా నాయక్ వారి కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం నిర్మితం అయిందని అందువలన మనకు స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకులను భారత రాజ్యాంగం రాసిన మహానియుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు వారి కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ పాల్గొన్నారు.
Post A Comment: